Thursday, April 25, 2024
- Advertisement -

అడిగిందంతే.. వరలక్ష్మి శరత్ కుమార్ కోసం కదిలిన తారలు..?

- Advertisement -

ప్రస్తుతం భారతదేశంలో కరోనా ఏ స్థాయిలో వ్యాపిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే వైరస్ ను కట్టడి చేయడం కోసం పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి.ఈ క్రమంలోనే కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టిన మరణాల సంఖ్య అదే స్థాయిలో కొనసాగుతోంది. కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం ప్రతి ఒక్కరు సరైన జాగ్రత్తలు పాటించడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తిను కట్టడి చేయవచ్చని ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు, క్రీడాకారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఓ వీడియో ద్వారా ప్రేక్షకుల అవగాహన కల్పించారు.

ప్రస్తుతం మాస్కు ధరించాలి అనే నిబంధన ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు నిబంధన కోసమే మాస్క్ ధరిస్తున్నారు కానీ జాగ్రత్తల కోసం మాస్కులు ధరించడం లేదు. కొందరు మాస్క్ గడ్డం కింద పెట్టుకుంటే, మరికొందరు నోటికి మాత్రమే పెట్టుకుంటున్నారు. మరికొందరు చెవికి జుంకాల తగ్గించుకుంటే, మరికొందరు హెడ్ బ్యాండ్ మాదిరిగా ఉపయోగిస్తున్నారు.

Also read:మళ్లీ పెళ్లికి సిద్ధమైన బిగ్ బాస్ నోయల్..?

ఈ క్రమంలోనే నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన తోటి నటులతో కలిసి ఈ వీడియోను తీశారు. మాస్క్ ధరిస్తే పూర్తిగా మన ముక్కు మూతిని కవర్ చేస్తూ ఉండాలని అప్పుడు మాత్రమే ఈ వైరస్ ను అదుపు చేయవచ్చని ఈ వీడియో ద్వారా ఆమె ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ వీడియోలో భాగంగా నటీనటులు సందీప్ కిషన్, రెజీనా,సతీష్, విద్యుల్లేఖ రామన్ వంటివారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:క్రేజీ ఆఫర్ దక్కించుకున్న కీర్తి సురేష్.. గుడ్ లక్ సఖి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -