Wednesday, April 24, 2024
- Advertisement -

“మాస్క్ పెట్టుకొమన్నావ్” సరే.. “మరి నీ ప్యాంట్ సంగతేంటి”.. అంటూ అనసూయను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!

- Advertisement -

బుల్లి తెరపై జబర్దస్త్ యాంకర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై సందడి చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. అదే విధంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటారీ జబర్దస్త్ భామ.

అనసూయ” థాంక్యూ బ్రదర్ “అనే సినిమాలో లీడ్ రోల్ పోషించారు.ఈ సినిమా మే 7న ఓటీటీలో విడుదలకానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది అనసూయ. ఈక్రమంలోనే తనకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను వీడియోలను షేర్ చేశారు. ఈ వీడియోలో మాస్కు పెట్టుకోవాలని, కొందరు ఎంతో బాధ్యతా రహితంగా ప్రవర్తించడం వల్లే ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇండియా వరకు చేరిందంటూ మాస్క్ ప్రాముఖ్యత చెబుతూనే చివర్లో తాను నటించిన “థ్యాంక్యూ బ్రదర్” సినిమా ప్రతి ఒక్కరు చూడాలని తెలియజేసింది.

Also read:లీకైన పుష్ప సినిమా స్టోరీ.. సుకుమార్ ఆ సినిమాను కాపీ కొట్టాడా?

ఈ సినిమా ప్రమోషన్లకు వెళ్తున్న అనసూయ తాజాగా ఒక బ్లాక్ కలర్ పొట్టి గౌను వేసుకుని తన అందాలను ఆరబోస్తూ తనదైన స్టైల్లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన అనసూయ పై నెటిజన్లు దారుణమైన కామెంట్లు పెడుతున్నారు. మాస్క్ వేసుకొమన్నావ్ సరే.. మరి నీ ప్యాంట్ సంగతేంటి.. ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా..అంటూ అనసూయపై నెటిజన్లు దారుణమైన కామెంట్లు చేస్తున్నారు.మరి అనసూయ ఈ కామెంట్లపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Also read:ఆ హీరోయిన్ నిర్ణయం కారణంగా ప్యాకప్ చెప్పిన నాని..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -