బీజేపి డైరెక్షన్లోనే వైఎస్ షర్మిల పార్టీ పెడుతున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఏపీ సీఎం జగన్ ఇప్పటికే బిజేపి తో కలసి పనిచేస్తున్నారని పేర్కొన్న జగ్గారెడ్డి… టిడిపి గోడమీద పిల్లిలా ఏటు తేల్చుకోలేక పోతోందని ఎద్దేవా చేశారు. వైసీపీ, టి.ఆర్.ఎస్, బీజేపి… మూడు కలిసి కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా అడ్డుకునే కుట్ర పన్నుతున్నాయని ఆక్షేపించారు.
ఉత్తరభారత్లో పట్టు కోల్పోతున్నందునే… బిజేపి దక్షిణ భారత్పై దృష్టి పెట్టింది. కాంగ్రెస్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బలమైన కంచుకోట. సెటిలర్స్ను షర్మిల వైపు తిప్పుకొనేందుకే కొత్త పార్టీ పెడుతున్నారు. కాంగ్రెస్లో తమలాంటి వారెందరో వైఎస్కు వారసులు ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ నుంచి విడదీయడానికే షర్మిలను బిజెపి రంగంలోకి దించింది. ఇప్పుడు షర్మిల వచ్చింది… రేపు జూనియర్ ఎన్టీఆర్ లేదంటే ఎన్టీఆర్ కుటుంబం నుంచి మరో వ్యక్తి కూడా పార్టీ పెట్టొచ్చు అని అన్నారు.
కర్మాగారానికి గనులు కేటాయించాలని డిమాండ్ చేయడం విచిత్రం..!
ఆసక్తి రేపుతున్న దిల్ రాజు నాట్యం టీజర్..!
భాగ్యనగరంలో కజికిస్థాన్ అడ్డా..మంచికే..!
ఒక్క ఛాన్స్ చివరి ఛాన్స్ అనేటట్లుగా తీర్పు ఇచ్చారు..!