స్వాతంత్య్రం పొంది ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న కజికిస్థాన్.. భారత్లో దౌత్య సంబంధాల్లో మరింత పురోగతి సాధించేందుకు హైదరాబాద్లో దౌత్యకార్యాలయం దోహదపడుతుందని ఆ దేశ రాయబారి యెర్లాన్ అలీంబాయెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మీర్ నాసిర్ అలీఖాన్ నేతృత్వంలో.. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కజికిస్థాన్ దౌత్యకార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాలకు రిపబ్లిక్ ఆఫ్ కజికిస్థాన్ గౌరవ్ కౌన్సుల్గా డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీఖాన్ నాలుగేళ్ల పాటు కొనసాగుతారని యెర్లాన్ ప్రకటించారు. ఫార్మా, ఐటీ వంటి ప్రాధాన్య రంగాల్లో తెలుగు రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు కజికిస్థాన్ ఆసక్తిగా ఉందని స్పష్టం చేశారు. తమ దేశ ప్రధాని ఈ ఏడాది భారత పర్యటనలో ఈ ఒప్పందాలపై దృష్టి సారిస్తారని తెలిపారు. వీటితో పాటు టూరిజం, మూవీ ఇండస్ట్రీలోనూ కజికిస్థాన్లో అద్భుత అవకాశాలున్నట్లు పేర్కొన్నారు.
నల్లగొండ జిల్లాపై సీఎం కేసీఆర్ వరాల జల్లు!
షర్మిల రాజకీయ ప్రవేశాన్ని మేం తప్పుపట్టడం లేదు..!
సంపూ హీరోగా ‘బజారు రౌడీ’ స్టిల్ అదుర్స్!
కోయిలమ్మ సీరియల్ నటుడు సమీర్ అరెస్ట్..చర్లపల్లి జైలుకు తరలింపు!