ప్రముఖ టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు చిత్రాలు ఎలా వుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమా అంటేనే ఇక హిట్ అని ఫిక్స్ అయిపోవాలి. ఇక తాజాగా ఆయన నిర్మిస్తున్న చిత్రం “నాట్యం”. కొత్తదర్శకుడు రేవంత్ కోరుకొండ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాకి డైరెక్టర్ గానే కాకుండా, స్క్రిప్ట్ రైటర్ గా, కెమెరామెన్ అండ్ ఎడిటర్ గా కూడా బాధ్యతలు వ్యవహరిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి.
ఇక ఈ సినిమా టీజర్ జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా అధికారికంగా విడుదల అయ్యింది. ప్రముఖ నాట్య కళాకారిణి అయిన సంధ్యారాజు హీరోయిన్ గా ఈ సినిమాలో నటించడం జరిగింది.ఇక ఈ సినిమా టీజర్ ని ఎన్టీఆర్ విడుదల చేయడంతో నెటిజన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు యూట్యూబ్ లో ఈ టీజర్ మంచి వ్యూస్ లతో ట్రెండింగ్ లో వుంది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే..శాస్త్రీయ నృత్యమైన కూచిపూడి ప్రధానంగా ఈ సినిమా ఉండబోతోంది. అంతేకాదు, టీజర్ లోనే సినిమా ఎలా ఉండబోతోంది అనేది చెప్పేశారు. టీజర్ చూస్తుంటే సంధ్యారాజు నటన ఎంతో అద్భుతంగా ఉంది. తెరకు కొత్తైనా స్వతహాగా నర్తకి కావడంతో చక్కని హావభావాలతో నాట్యం సినిమాకి ప్రాణం పోశారనే చెప్పాలి. డైరెక్టర్ కె. విశ్వనాథ్ సప్తపది సినిమా, సాగరసంగమం సినిమాలని గుర్తు చేసేలా ఉంది ఈ టీజర్.
శ్రవణ్ భరద్వాజ్ సంగీతం టీజర్ లో హైలెట్ గా నిలిచింది.అంతేకాదు, ఈ సినిమా ఒకవైపు పీరియాడికల్ స్టోరీలాగా కనిపిస్తున్నా, దీనికి మోడ్రన్ టచ్ కూడా ఇచ్చారు. ఇక టీజర్లో స్టార్ కాస్టింగ్ కూడా రివీల్ చేసేశారు. కమల్ కామరాజు, రోహిత్ బెహల్, భానుప్రియలు ప్రధానమైన క్యారెక్టర్స్ లో కనిపిస్తున్నారు. అంతేకాదు, ఒక క్లాసికల్ సినిమాలగా ఈ టీజర్ ని బట్టీ చూస్తే అర్ధం అవుతోంది. మరి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి.
భాగ్యనగరంలో కజికిస్థాన్ అడ్డా..మంచికే..!
ఒక్క ఛాన్స్ చివరి ఛాన్స్ అనేటట్లుగా తీర్పు ఇచ్చారు..!