దేశంలో పెద్ద నోట్ల రద్దు తో జనాలు బాగా ఇబ్బందులు పడుతున్నారు. చిల్లర దొరకాక.. చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అయితే ఈ పెద్ద నోట్ల రద్దు తర్వాత వస్తున్న వార్తలు ప్రజలను మరింత కన్ఫ్యూజన్కు గురి చేస్తున్నాయి. నోట్ల రద్దు తర్వాత కొత్తగా రూ.2 వేల నోటుతో పాటు కొత్తగా రూ.500 నోటు ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా ఇంకా ఈ కొత్త నోట్ల గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగానే ఇపుడు వచ్చిన వార్త మరింత షాక్ కలిగించేది ఉంది.
త్వరలో రూ.2వేల నోటు రద్దు అవుతుందని తెలుస్తోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) సిద్ధాంతకర్త – ఆర్థిక నిపుణుడు ఎస్ గురుమూర్తి ఈ షాకింగ్ న్యూస్ వెల్లడించారు. చిన్న నోట్లతో పాటు పెద్ద నోటు కూడా రద్దు అయ్యే అవకాశం ఉందన్నారు. రూ. 2 వేల నోటు రద్దు వచ్చే ఐదేళ్లలో ఎప్పుడైనా రద్దు అవుతుందని ఆయన అన్నారు. ఈ నోటు రద్దుతో దేశంలో రూ. 500 నోటే అతి పెద్ద నోటుగా చెలామణి అవుతుందని ఆయన జోస్యం చెప్పారు.
కొత్తగా రూ. 250 నోటు – రూ. 100 నోటును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇక వెయ్యి నోటు అయితే శాశ్వతంగా రద్దు కానుందని గురుమూర్తి తెలిపారు. నల్లధనం – అవినీతిని నిర్మూలించేందుకే ప్రధాని మోడీ గత నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దుచేశారని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక అవసరాలు తీర్చేందుకే రూ.2000 నోటు తీసుకువచ్చారని త్వరలో వాటిని రద్దు చేయడం ఖాయమని ఆయన చెప్పారు.
Related