Sunday, May 19, 2024
- Advertisement -

వారాహిపై బాలయ్య!

- Advertisement -

ఏపీ రాజకీయాల్లో పొలిటికల్ మల్టీస్టారర్‌ సందడి చేయనుంది. టీడీపీ – జనసేన కలిసి ఈ సారి పోటీచేస్తుండగా ఇప్పటికే వారాహి యాత్రలో బిజీగా ఉన్నారు పవన్. ఇప్పటివరకు వారాహి యాత్రలో జనసేన కార్యకర్తలే పాల్గొనగా తాజాగా పవన్ చేపట్టిన యాత్రలో టీడీపీ శ్రేణులు పాల్గొంటున్నాయి.

అయితే తాజాగా పొలిటికల్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో పవన్‌తో కలిసి వారాహి యాత్రలో పాల్గొననున్నారు బాలయ్య. ఇప్పుడి న్యూస్ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వారాహిపై బాలయ్య సందడి చేయనున్నారనే వార్త టీడపీ -జనసేన వర్గాల్లో జోష్ నింపుతోంది. ఇద్దరు కలిసి ప్రజాక్షేత్రంలో ఒకే వేదికను పంచుకుంటే అది రెండు పార్టీలకు కలిసివచ్చే అవకాశం కూడా ఉంది.అయితే సంక్షేమ పథకాలే తమను గట్టెక్కించి మళ్లీ అధికారంలోకి రావడానికి దోహదపడతాయని జగన్ విశ్వసిస్తున్నారు.

ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఇప్పటికే బాలకృష్ణతో టీడీపీ కోసం ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి. జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి వ్య‌తిరేకంగా ఈ సినిమా ఉండనుందనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబును జైల్లో పెట్టి జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో పవన్ – బాలయ్యను జగన్ ఎలా ఎదుర్కొంటారనేది చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -