భరత్ అనే నేను సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు తర్వాత సినిమాల ఫోకస్ పెట్టాడు.మహేష్ బాబు తర్వాత సినిమాల గురించి క్లారిటీతోనే ఉన్నప్పటికీ ఏది ముందు ఏది వెనుక అనే విషయంలో మాత్రం కొంత సంశయం ఉంది. మహేష్ బాబు 25వ సినిమా వంశీ పైడిపల్లి డైరక్షన్లో చేస్తున్నాడు.కాని దాని తరువాత సినిమాలపై క్లారిటీ లేదు.25వ సినిమా తర్వాత సుకుమార్ తో కాని సందీప్ రెడ్డి వంగా తో కాని చేస్తాను అని ప్రెస్ మీట్ లో చెప్పిన సంగతి తెలిసిందే. కాని మహేష్ 26వ సినిమా ఫిక్స్ అయింది.
మహేష్ 26వ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సుకుమార్ దర్శకత్వంలో నిర్మించబోతున్నట్టుగా ప్రకటించింది. సుకుమార్ తన రెగ్యులర్ స్టైల్ ని వదిలి చేసిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్ సాధిస్తే తొలిసారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మహేష్ నటించిన భరత్ అనే నేను కూడా అదే దారిలో ఉంది. సో ఈ ఇద్దరు కలవడం అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న సుకుమార్ స్క్రిప్ట్ వర్క్ త్వరలోనే మొదలు పెట్టబోతున్నట్టు టాక్.