ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ హీరోయిన్ బిజీగా ఉంది అని అడిగితే.. రెజీనా పేరే చెపుతారు. వరస సినిమాలు చేస్తూ.. చాలా బిజీగా ఉంది రెజీనా. అంతేకాకుండా త్వరలో బాలీవుడ్ చిత్రంలో కూడా నటించబోతుంది. ప్రస్తుతం రెజీనా ‘జ్యోఅచ్యుతానంద’ అనే చిత్రంలో నటిస్తోంది.
త్వరలోనే ఈ చిత్రం విడుదల కాబోతుంది… ఈ సందర్బంగా మీడియా తో చిత్ర విశేషాలను పంచుకుంటూ.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ఎఫైర్ నడుపుతుందనే వార్తల ఫై స్పదించింది.. అసలు మా ఇద్దరికి ఎపైర్ ఉందని ఎవరు చెప్పారు. ఎవరికి నచ్చినట్లు వాళ్లు రాసుకుంటున్నారు కానీ నాకు ఎవరితో ఏ ఎపైర్ లేదు అని తెల్చి చెప్పింది.
ఇప్పటివరకు టాలీవుడ్ లో చాలా మంది హీరోలతో నటించాను కానీ ధరమ్ తేజ్ తో మాత్రమే ఎందుకు లింక్ పెట్టారో అర్ధం కావడం లేదు అని తెలిపింది. మా మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు, బ్రేకప్ లేదా అంటూ సమాధానం తెలిపింది. ఇక తెలుగులో సందీప్ కిషన్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వం లో వస్తున్న ‘నక్షత్రం’ లో అలాగే మంచు మనోజ్ తో ఓ సినిమా చేస్తోంది.
Related