టాలీవుడ్ లో పోకిరీ మూవీ ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఆ మూవీకి ఎంత పేరు వచ్చిందో అందులో ఐటం సాంగ్ లో డాన్స్ చేసిన మమైత్ ఖాన్ కి కూడా అంతే పేరు వచ్చింది. ఇప్పటికి ఇంకా నా వయసు నిండా పదహారే అనే సాంగ్ ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ నాటుకుపోయింది.
అయితే ఆ తర్వాత మమైత్ ఖాన్ కు చాన్స్ లు తగ్గడం ప్రారంభించాయని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా.. షాకింగ్ నిజాలను వెల్లడించింది. ఇప్పటి వరకు తాను నలుగురితో సహజీవనం చేశానని ముమైత్ తెలిపింది. అయితే ఆ బంధాలన్నీ విడిపోయాయని చెప్పింది. తన తొలి సహజీవనం నాలుగేళ్ల పాటు కొనసాగిందని తెలిపింది.
రెండో సహజీవనం మూడున్నర ఏళ్ల పాటు కొనసాగించగా.. మూడో వ్యక్తితో రెండేళ్ల పాటు కలసి ఉన్నానని చెప్పింది. చివరి బంధం మాత్రం కేవలం ఏడాదిన్నరలోనే బెడిసికొట్టిందని చెప్పింది. ఇప్పట్లో సినిమాల్లో చాలా మంది ఐటం సాంగ్ లకు ఒకే చెప్పేస్తూ ఉండడంతో తనకు చాన్సులు రావడం లేదని తెలిపింది. తాను స్నేహపూర్వకమైన వ్యక్తినని, చాలా రొమాంటిక్, చాలా కేరింగ్ అని చెప్పింది. అయితే ఇక పై ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని ఫిక్స్ అయ్యినట్లు తెలిపింది.
{youtube}PBj0d5fIoRw{/youtube}
Related