బాహుబలి సినిమాతో ప్రభాస్దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా ప్రభాస్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రభాస్ పై పాయింట్ టు పాయింట్ కథనాలు వండి వడ్డిస్తోంది బాలీవుడ్ మీడియా.. ప్రస్తుతం డ్రగ్స్ రాకెట్ అంశం టాలీవుడ్ని షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నోటీసులు పొందిన ప్రముఖుల పేర్లన్నీ బయటకి వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ లిస్టులో రెబల్ స్టార్ ప్రభాస్ పేరు ఉందన్న వార్తలు జోరుగా హల్ చల్ చేస్తున్నాయి. ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో డ్రగ్స్కు బాగా ఆకర్షితుడయ్యాడట. పూరి జగన్నాథ్తో బుజ్జిగాడు సినిమా తీస్తున్న సమయంలో వీరిద్దరు మత్తు జగత్తులో తేలియాడేవారట. ప్రభాస్కి పూరి జగన్నాథ్ డ్రగ్స్ అలవాటు చేశాడని.. ఆ సినిమా టైంలో డ్రగ్స్ మత్తులో బ్యాంకాక్ హోటల్ లో నగ్నంగా తిరిగారనే న్యూస్ బాలీవుడ్ వెబ్ సైట్లలో షికార్లు చేస్తున్నాయి. దీంతో కుటుంబసభ్యులతో పాటు సన్నిహితులు ప్రభాస్ను తీవ్రస్థాయిలో మందలించారని.. ఇక అప్పటినుంచి ప్రభాస్ తనకున్న అలవాటును వదిలేసి సినీ కెరీర్పై దృష్టిసారించి సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్నాడని వార్తలు వెలువడుతున్నాయి . మరోవైపు ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు నోటీసులు ఇచ్చిన వారిలో ఓ టాప్ హీరో కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ప్రభాస్కి సంబంధించిన పేరు తెరమీదకు వచ్చింది. అయితె ఈ న్యూస్ లో అసలు నిజం ఏంటో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం ఈ న్యూస్ సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.
- Advertisement -
ప్రభాస్ కూడా డ్రగ్స్ రాకెట్లో ఉన్నాడా..?
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -