ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమిన్ (AIMIM) అధ్యక్షుడు మరియు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై ప్రశంసలు గుప్పించారు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు. ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్తాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఓవైసీ.

తాజాగా కువైట్ వేదికగా పాక్ చర్యలను ఖండించారు ఓవైసీ. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ… పాకిస్తాన్ దుష్ట చర్యలను ఖండించావు… పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరియు ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ ను “stupid jokers” (మూర్ఖ జోకర్లు) అని అభివర్ణించావని తెలిపారు.

ఓవైసీ, ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడి మరియు ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత ప్రభుత్వం చేపట్టిన విదేశాంగ వ్యూహంలో భాగంగా కువైట్ పర్యటిస్తున్నారు. ఆ సందర్భంలో పాకిస్తాన్ యొక్క మోసపూరిత ప్రచారాలను ప్రశ్నిస్తూ కాపీచేయడంలో కూడా విఫలమవుతున్నారని ఎద్దేవా చేశారు.