Saturday, April 27, 2024
- Advertisement -

మళ్ళీ దాయాదుల పోరు.. గెట్ రెడీ ?

- Advertisement -

క్రికెట్ లో కొన్ని జట్ల మద్య జరిగే మ్యాచ్ లు యావత్ ప్రపంచం మొత్తాని ఆకర్షిస్తాయి. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మద్య జరిగే మ్యాచ్ గాని, అలాగే టీమిండియా పాకిస్తాన్ మద్య జరిగే మ్యాచ్ గాని, ఇంకా ఇంగ్లండ్ ఆస్ట్రేలియా మద్య జరిగే మ్యాచ్ గాని ఇలా కొన్ని జట్ల మద్య జరిగే పోరును చూసేందుకు ప్రపంచ క్రీడాభిమానులు అమితంగా ఆసక్తి కనబరుస్తుంటారు. ముఖ్యంగా వీటన్నిటిలోకెల్లా ఇండియా పాకిస్తాన్ మద్య జరిగే మ్యాచ్ లకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఈ రెండు జట్ల మద్య జరిగే మ్యాచ్ ను కేవలం క్రికెట్ గా మాత్రమే కాకుండా దేశ ప్రతిష్టకి సంబంధించినది గా భావిస్తారు ఇరు దేశాల అభిమానులు.

అందుకే క్రికెట్ లో దాయాదుల పోరు చూడడానికి అత్యంత ఆసక్తి కనబరుస్తారు. ఇక ఈఏడాది టీ20 వరల్డ్ కప్ లో ఇప్పటికే ఈ రెండు జట్లు తలపడ్డాయి. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ చేసిన అసాధారణ పోరాటం టీమిండియా గెలుపుకు జీవం పోసింది. ఇక ఆ మ్యాచ్ అభిమానులకు పంచిన వినోదం అంతా ఇంతా కాదు. ఒక చిరస్మరణీయ మ్యాచ్ గా అభిమానుల గుండెల్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక మరొకసారి ఇండియా పాకిస్తాన్ మద్య మ్యాచ్ జరిగితే చూడాలని ప్రతి క్రికెట్ అభిమాని కోరుకుంటాడు. మరి ఈ వరల్డ్ కప్ లో మరోసారి దాయాదుల పోరు చూసే అవకాశం ఉందా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

లీగ్ దశలో ఇండియా, జింబాబ్వే చేతిలో ఓడిపోయిన పాక్ జట్టు.. సెమీస్ కు చేరడం చాలా కష్టం అని భావించరంతా. అయితే ఎవరు ఊహించని విధంగా సూపర్ 12 లో నెదర్లాండ్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవడంతో.. అనూహ్యంగా పాకిస్తాన్ సెమీస్ కు చేరింది. ఇక సెమీస్ లో పాక్ జట్టు న్యూజిలాండ్ జట్టుతో తలపడాల్సి ఉంటుంది. మరోవైపు ఇండియా ఇంగ్లండ్ తో తలపడాల్సి ఉంటుంది. అటు పాక్ న్యూజిలాండ్ పై.. అలాగే ఇండియా ఇంగ్లండ్ జట్టుపై గెలిస్తే.. ఇండియా, పాక్ జట్లు మరోసారి ఫైనల్ లో తలపడే అవకాశం ఉంది. ఇక టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో దాయాదుల పోరు అంటే ఆ ఉహే వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. మరి టీమిండియా, పాక్ జట్లు ఫైనల్ కు చేరతాయో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -