ఏపీ సీఎం జగన్కు జై కొట్టారు మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. జగన్తోనే ఏపీకి రక్షణ అని తేల్చేశారు. వైసీపీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉంటేనే ముస్లింలకు రక్షణ ఉంటుందని చెప్పారు.
జగన్ను వదులుకుంటే..ఏపీలో ముస్లింలు బతకలేరని, ఎన్డీయే కూటమి ఏపీలో విజయం సాధిస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తారని మండిపడ్డారు.
ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు హక్కులు కల్పించింది జగనేనని .. అనేక పథకాలు ఇచ్చారు. ఇప్పుడు ఆయనను వదులుకోవద్దని మేం పిలుపునిస్తున్నాం అని తెలిపారు ఓవైసీ. ఇదే సమయంలో చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు ఓవైసీ.
చంద్రబాబు రాజకీయ అవకాశ వాది అని..ఎవరితో అవసరం ఉంటే వారితో తిరుగుతుంటారని మండిపడ్డారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని, జగన్కు ముస్లింలంతా మద్దతివ్వాలని కోరారు. ఇక ఓవైసీ చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.