వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా పడింది. తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా… ఈ నెల 9న హైదరాబాద్లోని ఆమె నివాసం లోటస్ పాండ్లో నల్గొండ జిల్లా నేతలతో భేటీ అయ్యారు.
తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం కొత్త పార్టీ పెట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు. అందుకోసం వైఎస్సాఆర్ అభిమానుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.సమావేశాలకు లోటస్ పాండ్ సరిపోదని భావించిన షర్మిల… జిల్లాల్లోనే పర్యటించాలని నిర్ణయించారు.
ఈ నెల 21న ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున… ఖమ్మం పర్యటనను వాయిదా వేసుకున్నట్టు ఆమె సన్నిహితులు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత సమావేశం కానున్నట్టు వెల్లడించారు.
నేను సీఎం మనిషిని..రూ.50 వేలు పంపు..!
మోదీకి కలిసి సూచనలు ఇచ్చాను: ఎంపీ రఘురామకృష్ణరాజు..!
ఘట్కేసర్ అత్యాచారం కేసు.. ట్విస్టుల మీద ట్విస్టులు.. అసలు మ్యాటర్ తెలిస్తే షాక్!