ఈ మద్య సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. ఫోన్ నెంబర్లు ట్రాప్ చేసి కొంత మంది అకౌంట్లు కొల్లగొడుతున్నారు. మరికొంత మంది దొంగ నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ చేసి అందినంత దోచుకుంటున్నారు.
తాను సీఎం కార్యాలయం నుంచి మాట్లాడుతున్నా అంటూ జగిత్యాల మున్సిపల్ పట్టణ ప్రణాళిక విభాగం సూపర్ వైజర్ తేజస్వినికి ఓ ఆగంతకుడు కాల్ చేశాడు. ‘5 నిమిషాల్లో గూగుల్ పేలో రూ.50 వేలు పంపాలి… లేకుంటే పదోన్నతి ఆగిపోతుంది’ అని ఆ కాల్ సారాంశం.
ఎస్పీ సింధు శర్మను తేజస్విని ఆశ్రయించింది. బెదిరింపు కాల్ నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రత్యేక బృందాలని హైదరాబాద్కు పంపాయి. ఆ నంబర్పై ఆరా తీయగా.. హిమాయత్ నగర్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతని గురించి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
మోదీకి కలిసి సూచనలు ఇచ్చాను: ఎంపీ రఘురామకృష్ణరాజు..!
మేయర్ విజయలక్ష్మికి ఫ్లెక్సీ షాక్..!
జానారెడ్డి పై.. ఓ రేంజ్ లో ఎర్రబెల్లి ఫైర్..!
ఘట్కేసర్ అత్యాచారం కేసు.. ట్విస్టుల మీద ట్విస్టులు.. అసలు మ్యాటర్ తెలిస్తే షాక్!