Tuesday, May 21, 2024
- Advertisement -

పవన్ కాస్త తగ్గితే మంచిదని సూచించిన చంద్రబాబు!

- Advertisement -

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సున్నితంగా చురక అంటించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పవన్ మరీ ఎక్కువగా రెచ్చిపోతే బాగుండదు..

ఆయన కాస్తం సైలెంట్ గా ఉంటేనే మంచిదన్నట్టుగా ఆయన వ్యాఖ్యానాలు చేశాడు. జపాన్ పర్యటనను పూర్తి చేసుకొని వచ్చిన చంద్రబాబు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యానాలు చేశారు. పవన్ కల్యాణ్ పేరును సూటిగా ప్రస్తావించకుండానే బాబు ఈ సూచన చేశారు. జనసేన అధినేత పవన్ వ్యాఖ్యానాలపై స్పందించాల్సిందిగా మీడియా బాబు ను కోరింది. ఈ సందర్భంలో బాబు స్పందిస్తూ.. రాష్ట్ర విభజన జరిగి కొంత కాలమే అయ్యిందని.. ఇప్పుడు అందరూ సహనంతో ఉండాల్సిన అవసరం ఉందని హితబోధ చేశారు. పవన్ విషయంలో మీడియా ప్రశ్నలకు బాబు ఈ విధంగా స్పందించారు. ఈ విధంగా ఉంది తెలుగుదేశం అధినేత చేసిన సూచన!<రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి దక్కాల్సిన వాటి విషయంలో తెలుగుదేశం ఎంపీలు ఢిల్లీలో సరిగా పోరాడటం లేదని.. పవన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం ఎంపీల పేర్లు ప్రస్తావిస్తూ.. వాళ్లు పార్లమెంటు గోడలు చూడటానికి వెళ్లారేమో అని పవన్ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలు కూడా తీవ్రంగానే రియాక్ట్ అయ్యారు. ఈ నీతులు మీ అన్నయ్యకు చెప్పు అంటూ వారు విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో బాబు తన పార్టీ ఎంపీలను ఏమీ అనకుండా.. సహనంతో ఉండాలని.. తగ్గి ఉండాలని జనసేన అధినేతకే సూచన చేసినట్టుగా ఉన్నాడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -