Wednesday, May 7, 2025
- Advertisement -

బాలికల కేసులో శిక్ష అనుభవిస్తున్న ఓ దోషి మృతి..!

- Advertisement -

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిహార్​ ముజఫర్​పుర్​ ఆశ్రమ బాలికల కేసులో శిక్ష అనుభవిస్తున్న ఓ దోషి మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిహార్​ జైలులో ఉన్న రామనుజ్​ ఠాకుర్​ అనే వ్యక్తి డిసెంబర్​ 3న మూడో నంబర్​ జైలులో ప్రాణాలు కోల్పోయాడు. అయితే.. అతని వయస్సు 70 దాటిందని, సహజ మరణమేనని జైలు అధికారులు తెలిపారు. ఎలాంటి అనుమానాస్పద అంశాలు కనిపించలేదని.. పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెప్పారు.

ముజఫర్​పుర్​ ఆశ్రమ బాలికల కేసులో 21 మందికి శిక్ష ఖరారు చేసింది దిల్లీ కోర్టు. అందులో ప్రధాన దోషి బ్రిజేష్​ ఠాకుర్​. అతని మామ రామనుజ్​ ఠాకుర్​ కూడా అరెస్టయ్యాడు. ఈ కేసులో దోషిగా తేలటం వల్ల తిహార్​​ జైలుకు 2019, ఫిబ్రవరి 23న తరలించారు. బాలికలపై అత్యాచారానికి పాల్పడటం వంటి తీవ్ర నేరాల కింద రామనుజ్​ ఠాకుర్​కు శిక్ష పడింది. అతనికి 2020, ఫిబ్రవరి 11న జీవిత ఖైదు, అలాగే రూ.60 వేల జరిమానా విధించింది ఢిల్లీ కోర్టు.

సమస్తిపుర్​కు చెందిన రామనుజ్​ ఠాకుర్​.. ముజఫర్​పుర్​లో ఉంటూ బాలికల ఆశ్రమ బాధ్యతలు చూసుకుంటుండేవాడు. ఈ క్రమంలోనే నేరాలకు పాల్పడినట్లు తేలింది.

Also Read

మళ్లీ ముఫ్తీ గృహనిర్బంధం..!

కౌగిలింతలకి నో : డబ్ల్యూహెచ్​ఓ

అయోధ్య లో కింద బాగం మొత్తం ఇసుక.. ఆశ్చర్యమే..!

వెనెజువెలా ఎన్నికలలో అఖండ విజయం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -