Friday, March 29, 2024
- Advertisement -

కౌగిలింతలకి నో : డబ్ల్యూహెచ్​ఓ

- Advertisement -

అగ్రరాజ్యంలో కరోనా కోరలు చాస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) అప్రమత్తమైంది. రానున్నసెలవు సీజన్​లో అమెరికా ప్రజలు.. తమ బంధువులు, కుటుంబసభ్యులను ఆలింగనం చేసుకోవద్దని, భౌతిక దూరం పాటించాలని సూచించింది.

అగ్రరాజ్యంలో కొవిడ్​ వ్యాప్తి పనిచేసే కార్యాలయాల్లో, ఇళ్లల్లో ఆహారాన్ని పంచుకోవటం తదితర కారణాల ద్వారా జరుగుతోందని డబ్ల్యూహెచ్​ఓ సాంకేతిక అధికారి మరియా వాన్ కెర్కోవె తెలిపారు. యూకేలోనూ ప్రజలు ఆలింగనం చేసుకోవటం నిషేధించారు బ్రిటన్​ మెడికల్ అధికారి క్రిస్​ విట్టీ.

ప్రపంచంలోనే అత్యంత సమర్థమైన ఆరోగ్య వ్యవస్థ ఉన్న దేశం అమెరికా. అత్యాధునిక సాంకేతికతకు నిలయమైన అగ్రరాజ్యంలో నిమిషానికి ఒకరు కరోనాతో మరణిస్తున్నారు. ప్రపంచంలోని మొత్తం కరోనా కేసుల్లో మూడో వంతు అమెరికాలోనే నమోదయ్యాయి. ఇది చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఆలింగనం చేసుకోవద్దని డబ్ల్యూహెచ్​ఓ చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించి ఉండం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పదు అని డబ్ల్యూహెచ్​ఓ ప్రతినిధి అన్నారు.

Also Read : కారు పార్టీతో కాంగ్రెస్‌ కలిసి నడుస్తుందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -