Sunday, May 5, 2024
- Advertisement -

మళ్లీ ముఫ్తీ గృహనిర్బంధం..!

- Advertisement -

పీడీపీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి మరోసారి గృహ నిర్బంధం విధించారు జమ్ముకశ్మీర్ అధికారులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం నిర్వహించేందుకు బుద్గాం వెళ్లాల్సిన ఆమెను పోలీసులు ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదని పీడీపీ నాయకులు తెలిపారు.


ఇటీవలే పుల్వామా జిల్లాలో పీడీపీ యువజన అధ్యక్షుడు వహీద్ రెహ్మాన్​ పెరేహ్​ను కలిసేందుకు వెళ్లాలనుకున్న మెహబూబా ముఫ్తీకి అనుమతి నిరాకరించారు జమ్ముకశ్మీర్​ పోలీసులు. ఇప్పుడు ప్రచారంలో పాల్గొనకుండా గృహ నిర్బంధం విధించారు.

జమ్ముకశ్మీర్​ అధికార యంత్రాంగం తీరుపై పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ మండిపడుతున్నాయి. డీడీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించకుండా కావాలనే ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -