Thursday, March 28, 2024
- Advertisement -

అయోధ్య లో కింద బాగం మొత్తం ఇసుక.. ఆశ్చర్యమే..!

- Advertisement -

అయోధ్యలో రామమందిర నిర్మాణ ప్రణాళికపై చర్చించేందుకు నిపుణులతో రెండు రోజుల సమావేశం నిర్వహిస్తోంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు. సోమవారం జరిగిన మొదటి రోజు సమావేశంలో ఆలయ పునాదుల నిర్మాణంపై చర్చించారు. ఎల్ అండ్ ​టీ, టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ లిమిటెడ్​ ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశానికి రామాలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్​ నృపేంద్ర మిశ్రా నేతృత్వం వహించారు. రామమందిర నిర్మాణ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు.

పునాది నిర్మాణ ప్రణాళికను ఖరారు చేసే పనిలో నిమగ్నమైనట్లు ఆలయ నిర్మాణ కమిటీలోని కీలక సభ్యుడు అనిల్​ మిశ్రా తెలిపారు. సమావేశంలో భాగంగా ఆలయాన్ని నిర్మిస్తున్న ప్రదేశాన్ని నిపుణులు పరిశీలించినట్లు పేర్కొన్నారు.

రామాలయం నిర్మిస్తున్న భూభాగ ఉపరితలం అడుగులో ఇసుక ఉండటంపై అనిల్ మిశ్రా స్పందించారు. అది తమకు ఆశ్చర్యమేమీ కల్గించలేదని చెప్పారు. నదీతీర ప్రాంతంలో ఆలయాన్ని నిర్మిస్తున్నందన ఇలాంటివి సహజమేనని, దీనివల్ల ప్రాజెక్టుకు ఎలాంటి అవరోధాలు ఏర్పడవని స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -