Monday, May 5, 2025
- Advertisement -

నీరజ్​ చోప్రా పునరాగమనంలో సత్తా.. చోప్రా కి జాతీయ అవార్డ్..!

- Advertisement -

ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించిన భారత జావెలిన్ త్రో స్టార్​ నీరజ్​ చోప్రా పునరాగమనంలో సత్తా చాటాడు. ఇండియన్​ గ్రాండ్​ ప్రి అథ్లెటిక్స్​ మీట్​లో ఈ పానిపట్​ కుర్రాడు కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. ఏడాది విరామం తర్వాత మళ్లీ బరిలో దిగిన నీరజ్​ శుక్రవారం జరిగిన పోటీల్లో జావెలిన్​ను 88.07 మీటర్ల దూరం విసిరి.. తన పేరిటే ఉన్న రికార్డు (88.06 మీ)ను బద్దలు కొట్టాడు.

ఈ ఈవెంట్లో మొదట జావెలిన్​ను 83.03 మీటర్లు విసిరిన చోప్రా.. ఆ తర్వాత రెండు ఫౌల్​ త్రోలు వేశాడు. నాలుగో త్రోను 83.36 మీటర్లు వేసిన అతడు.. ఐదో ప్రయత్నంలో 88.07 మీటర్లు విసిరి రికార్డును తిరగరాశాడు. టోక్యోకు వెళ్లబోతున్న మరో జావెలిన్ ఆటగాడు శివ్​పాల్​ సింగ్ (81.63 మీ) రెండో స్థానంలో నిలిచాడు. గతేడాది జనవరిలో దక్షిణాఫ్రికాలో జరిగిన అథ్లెటిక్స్​ మీట్​లో నీరజ్​ ఒలింపిక్స్​కు అర్హత సాధించాడు.

రవిచంద్రన్​ అశ్విన్​ అరుదైన ఘనత..!

అభిమాని చెంప ఛెల్లుమనిపించిన బాలకృష్ణ.. ఎందుకో తెలుసా?

ఎంపీ, ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన కోర్టు.. అందుకేనా?

భారతీయులపై నేపాల్‌లో కాల్పులు.. పోలీసులు చెప్పిన కారణం ఏమిటి అంటే…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -