Monday, May 6, 2024
- Advertisement -

ఎంపీ, ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన కోర్టు.. అందుకేనా?

- Advertisement -

చట్టానికి ఎవరూ చుట్టాలు కాదు.. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, ప్రజా ప్రతినిధులు ఎవరైనా సరే నేరం చేస్తే తప్పించుకోవడం కష్టమని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. తాజాగా వసతిగృహం ప్రారంభించారన్న వివాదంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ప్రజా ప్రతినిధుల కోర్టు దోషులుగా తేల్చింది. 2015లో నల్గొండలో ఎస్సీ వసతిగృహం ప్రారంభం వివాదం కేసులో ఇవాళ ఈ తీర్పు వెలువరించింది కోర్టు… కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిరుమర్తి లింగయ్యకు రూ.4,200 చొప్పున జరిమానా విధించిన కోర్టు.. ఆ జరిమానా చెల్లించకపోతే నెల రోజుల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పింది. 

నల్గొండలో 2015లో ఎస్సీ, ఎస్టీ వసతి గృహంతో పాటు… పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభోత్సవం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు అప్పుడు కాంగ్రెస్​లో ఉన్న ప్రస్తుత తెరాస ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తదితరులు ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ విషయంలో జరిగిన వివాదానికి సంబంధించి నల్గొండలో ఐదు కేసులు నమోదయ్యాయి. నిన్న నాలుగు కేసులను కొట్టివేసిన ప్రజా ప్రతినిధుల కోర్టు.. ఇవాళ మరో కేసులో తీర్పు వెల్లడించింది. మొత్తంగా 13 మందికి జరిమానా విధిస్తూ ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు వెల్లడించింది.. చట్టవిరుద్ధంగా గుమ్మిగూడడం, అక్రమ చొరబాటు అభియోగాలు రుజువైనట్టు ఈ సందర్భంగా పేర్కొంది ప్రజాప్రతినిధుల కోర్టు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -