Friday, May 9, 2025
- Advertisement -

రెస్టారెంట్​ లక్ష్యంగా ఆత్మాహుతి దాడి…!

- Advertisement -

సోమాలియా రాజధాని మొగాదిషులో ఉగ్రమూక బీభత్సం సృష్టించింది. పోలీస్​ అకాడమీ సమీపంలో ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఆఫ్రికాలోని ఉగ్రవాద సంస్థ అల్​-షబాబ్​ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందగా.. మరో 8 మంది క్షతగాత్రులు అయ్యారని సోమాలియా అధికార ప్రతినిధి సాదిఖ్​ అదాన్​ అలీ తెలిపారు. పోలీసులు వెళ్లే ఓ రెస్టారెంట్​ లక్ష్యంగా ముష్కరులు ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు.

దక్షిణ, మధ్య సోమాలియా ప్రాంతాలను నియంత్రించే అత్యంత చురుకైన ముష్కర ముఠా అల్-షబాబ్​. మొగాదిషు లక్ష్యంగా ఈ​ ఉగ్ర సంస్థ తరచూ దుశ్చర్యలకు పాల్పడుతోంది. సోమాలియాలో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఏడాదిలో అనేక సార్లు మోర్టార్​ దాడులు జరిపింది. అమెరికా రాయబార కార్యాలయం ఆ ప్రాంతానికి సమీపంలోనే ఉంది.

ఇది నిజంగా మహా అద్భుతం.. చచ్చి బతికాడు!

మొదటి సారి బైడెన్ విమర్శలు..!

ఓరి ద్యావుడా.. పావురం ధర రూ. 14కోట్లు.. ఇంతకీ స్పెషల్ ఏమిటి..?

గబ్బర్ సింగ్ డైలాగ్స్ కొట్టి చిక్కుల్లో పడ్డ పోలీస్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -