రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దాఖలైన పిటిషన్ పై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. పబ్లిక్ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించాలని ప్రభుత్వానికి సూచించింది. కరోనా నిబంధలు కఠినంగా అమలు చేయాలని తేల్చిచెప్పింది.
సినిమా హాళ్లు , షాపింగ్ మాల్స్, ఇతర కమర్షియల్ కాంప్లెక్స్లలో కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని సూచించింది. పిల్లలకు కోవిడ్ చికిత్స అందించే ఆస్పత్రుల్లో సౌకర్యాలను మరింత మెరుగుపర్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను సైతం మరింత పెంచాలని, కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని తెలిపింది. సినిమా హాల్స్, మాల్స్, సంతల్లో కరోనా మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్ర సరిహద్దులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించింది. పిల్లల కోసం నిలోఫర్ తోపాటు మరో ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయాలని వెల్లడించింది.
హై అలర్ట్.. తెలంగాణలో కరోనా కలకలం