తెలంగాణా ఎన్నికల్లో అధికారపార్టీ టీఆర్ఎస్దే విజయం అని మరో సారి తేలిపోయింది. స్పష్టమైన మెజారిటీతో మరో సారి సీఎం పీఠాన్ని కేసీఆర్ అధిరోహించనున్నారు. తాజాగా డెక్కన్ ఫౌండేషన్ ఫర్ డెవలెప్మెంట్ ( A Research Orgnization on Idian Democracy at Work) చేసిన సర్వేలో టీఆర్ఎస్ 77 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించి మరోసారి అధికారం చేపట్టనుందని తెలిపింది. ఒక్కో నియోజక వర్గంలో 1.5 శాతం ఓటర్స్ శాంపిల్స్ ఆధారంగా ఈ సర్వే చేపట్టింది. 23 సీట్లతో మహాకూటమి రెండో స్థానంలో ఉండనుంది.
సర్వేలో ప్రధానంగా 24 గంటల కరెంటు, లా అండ్ ఆర్డర్, వెల్ఫేర్ స్కీమ్స్, రైతులకోసం ఏర్పాటు చేయనున్న ఫండ్, త్రాగు, సాగునీరు, పెన్సస్ లాంటి పథకాలే టీఆర్ఎష్ను గెలిపించనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాంటి హంగ్ రాదని ..అధికార పార్టీ టీఆర్ఎస్ను నిలువరించడంలో మహాకూటమి ఎలాంటి ప్రభావం చూపలేదని సర్వే తెలిపింది.
జిల్లాల వారీగా పార్టీలకు సీట్లు..
ఆదిలాబాద్ : టీఆర్ఎస్ 06, కాంగ్రెస్ 02, బీఎస్పీ 01, ఇండిపెండెంట్ 01
నిజామాబాద్ : టీఆర్ఎస్ 07, కాంగ్రెస్ 01, బీజేపీ 01
కరీంనగర్ : టీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 02, ఇండిపెండెంట్ 01
మెదక్ : టీఆర్ఎస్ 08, కాంగ్రెస్ 02
రంగారెడ్డి : టీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 02, బీఎస్పీ 01, ఇండిపెండెంట్ 01
హైదరాబాద్ : టీఆర్ఎస్ 06, భాజాపా 02, ఎమ్ఐఎమ్ 07
మహబూబ్ నగర్ : టీఆర్ఎస్ 09, కాంగ్రెస్ 03, ఇండిపెండెంట్ 01, బీఎల్ఎఫ్ 01
నల్గొండ : టీఆర్ఎస్ 08, కాంగ్రెస్ 03, బీఎల్ ఎఫ్ 01,
వరంగల్ : టీఆర్ఎస్ 09, కాంగ్రెస్ 03
ఖమ్మం : టీఆర్ఎస్ 04, కాంగ్రెస్ 02, టీడీపీ 03, ఇండిపెండెంట్ 01