Tuesday, April 30, 2024
- Advertisement -

సీపీఐ – కాంగ్రెస్ పొత్తు ఖరారు

- Advertisement -

ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల రేసులో వైసీపీ సింగిల్‌గా వస్తుండగా టీడీపీ- బీజేపీ – జనసేన కూటమిగా వస్తున్నాయి. ఇక కాంగ్రెస్ సైతం సీపీఐతో పొత్తులో కలిసివస్తోంది. ఇప్పటికే 114 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్.

ఇక తాజాగా సీపీఐతో పొత్తు ఖరారు చేసింది కాంగ్రెస్. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. ఒక ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో సీపీఐ పోటీ చేయనుంది. గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. అలాగే సీపీఐ పోటీ చేసే అసెంబ్లీ స్థానాలను పరిశీలిస్తే విజయవాడ పశ్చిమ, విశాఖపట్నం పశ్చిమ, అనంతపురం, పత్తికొండ, తిరుపతి, రాజంపేట, ఏలూరు, కమలాపురం ఉన్నాయి.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ 18న విడుదల కానుండగా ఎన్నికల సమరం మరింత హీటెక్కనుంది. కడప లోక్‌సభ నుండి షర్మిల, కాకినాడ నుంచి పల్లంరాజు, రాజమహేంద్రవరం నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -