విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై రాజ్యసభ సాక్షిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. పోస్కో బృందం స్టీల్ ప్లాంట్ను ఇప్పటికే మూడుసార్లు సందర్శించిందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. పోస్కో, రాష్ట్రీయ ఇస్పంత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) మధ్య భూముల అప్పగింతకు ఒప్పందం కుదిరిందని మంత్రి తెలిపారు.
ఇదిలా ఉంటే తాజాగా చంద్రబాబుపై మరోసారి వైసీపీ నేత విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ వేధికగా ఫైర్ అయ్యారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరించాలని కేంపోస్కో కంపెనీ ప్రతినిధులు, కొరియా రాయబారి 2018 అక్టోబర్ 22న విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించినట్టు స్వయంగా కేంద్ర మంత్రి పార్లమెంటులో తెలిపారని.. కానీ బాబు రంకెలు వేస్తూ రెండు కళ్ల సిద్ధాంతం జపిస్తున్నాడని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై పార్టీలకు అతీతంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ప్రక్రియ చంద్రబాబు హయాం లోనే ప్రారంభమైందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
ఈ రెండు పార్టీలు చేసిన మోసం అందరూ చూశారు..!
రెండు చోట్ల ఎన్నికలు.. షెడ్యుల్ ఇదే..!
నవ్వుతూ మాట్లాడిన నిమ్మగడ్డ.. మొన్న కోపం నేడు హ్యాపీ..!
తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా!