ప్రస్తుం సాప్ట్ వేర్రంగంలో నొలకొన్న అనిశ్చితి కారనంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూంటె…దేశీయ రెండో అతిపెద్ద ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ చెప్పింది. వార్శిక క్యాంపస్ రిక్రూట్ మెంట్ ఉంటుందని నిరుద్యోగులకు సంకేతాలు పంపింది.
ఈ రిక్రూట్ మెంట్ కింద 20వేల మంది ఇంజనీర్లను కంపెనీలోకి తీసుకోనున్నట్టు సంస్థ ప్రకటించింది.
అయితే ఇటీవల కాలంలో క్లయింట్స్ ఎక్కువగా డిజిటల్, క్లౌడ్, అనాలిటిక్స్ వైపు ఎక్కువగా దృష్టిసారిస్తున్నారని ఇన్ఫీ పేర్కొంది. అందుకే డిజిటల్, అనాలిటిక్స్ లాంటి కొత్త స్కిల్స్ ఉన్న అభ్యర్థులకే తాము ఎక్కువ ఛాన్స్ ఇవ్వనున్నామని తెలిపింది.సెప్టెంబర్ నుంచి వార్షిక క్యాంపస్ నియామకాలు చేపట్టనున్నట్టు ఇన్ఫీ అధికార ప్రతినిధి చెప్పారు.
{loadmodule mod_custom,Side Ad 1}
ప్రస్తుతం నియామకాల పద్ధతిని మార్పు చేస్తున్నామని, విభిన్నమైన స్కిల్స్ ఉన్న హై-వాల్యు గ్రాడ్యుయేట్లు ఎక్కువగా ఆకట్టుకునే అవకాశముందని కూడా ఇన్ఫోసిస్ అధికార ప్రతినిధి తెలిపారు.స్కేల్ వైపు నుంచి స్కిల్ వైపు ఎక్కువగా ఐటీ సర్వీసుల సెక్టార్ ఫోకస్ చేసిందని కంపెనీలు చెబుతున్నాయి.10వేల మంది అమెరికన్లకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించనున్నట్టు గత నెలలోనే ఇన్ఫోసిస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Related
- 23 నుంచి బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రారంభించనున్న పేటీఎమ్
- వచ్చే మూడు సంత్సరాలల్లో ఐటీ రంగంలో 6 లక్షల ఉద్యోగాలు పోనున్నాయి.
- సంస్థనుంచి 1000 మంది ఉద్యోగుల తొలగింపు…
- అమెరికాలో తొలిసారిగా 800 బిలియన్ డాలర్ల క్యాపిటలైజేషన్ మార్కును దాటిన యాపిల్