Saturday, May 18, 2024
- Advertisement -

36 వేల రూపాయ‌ల ఖ‌ర్చుతో కొడుకు పెళ్లి చేస్తున్న‌ ఐఏఎస్..

- Advertisement -

ప్ర‌స్తుతం పెళ్లిల్లు చేయాలంటే ల‌క్ష‌ల‌ఖ‌ర్చుతో కూడుకున్నది. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలు సైతం త‌మ పిల్ల‌ల పెళ్లిల్ల‌ ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా ఘ‌నంగా చేస్తున్నారు. ధ‌నికుల పెళ్లి అంటే చెప్పాల్సిన ప‌నిలేదు. ఎవ్వ‌రు కూడా పెళ్లి ఖ‌ర్చుల‌కు వెన‌కాడ‌టంలేదు. ఇక ఓ ఐఏఎస్ అధికారి ఇంట వివాహమంటే… చెప్పేక్కర్లేదు. విపరీతమైన ఆడంబరంగా జరుగుతుందని భావిస్తాం. కానీ, దానికి విరుద్ధంగా ఓ ఐఏఎస్ అధికారి తన కుమారుడి పెళ్లికి కేవలం రూ.18 వేలు ఖర్చుచేయబోతున్నారు. మామూలు ఉద్యోగి ఇంట్లో పెళ్లి అంటేనే హడావుడి ఉంటుంది. కానీ, విశాఖ మెట్రో ప్రాంతీయ అభివృద్ధి మండలి (వీఎంఆర్‌డీఏ) కమిషనర్‌ పట్నాల బసంత్‌కుమార్‌ దీనికి విరుద్ధం.

గ‌తంలో త‌న కుమార్తె వివాహాన్ని రూ.16000 ఖ‌ర్చు చేసిన ఆయ‌న కుమారుడి పెల్లిని రూ. 18 వేల‌తో చేస్తున్నారు. ఈ నెల 10న విశాఖలోని దయాల్‌నగర్‌లో సత్సంగ్‌ ఆధ్వర్యంలో వివాహం జరగనుంది. ఈ కార్యక్రమానికి పెళ్లి కుమార్తె తరఫువారు రూ.18 వేలు, పెళ్లి కుమారుడి తరఫువారు రూ.18 వేలు భరించనున్నారు. మొత్తం 36 వేల రూపాయ‌ల‌తో వివాహాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఈ వివాహానికి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌శింహ‌న్ హాజ‌ర‌వ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -