అంతర్జాతీయంగీ ఐటీ రంగంలో వస్తున్న మార్పులు …దేశీయ ఐటీ కంపెనీలకు శాపంగా మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న చర్యలతో సంక్షోభ పరిస్థితులును ఎదుర్కొంటున్న ఐటీ సంస్థలు గణనీయంగా ఉద్యోగులను తగ్గించుకుంటున్నారు.
ఇప్పటికే దిగ్గజాలు విస్రో,ఇన్ఫోసిస్,కాగ్నిజెంట్ దిగ్గజ సంస్థలు ఇప్పటికే ఉద్యోగులను భారగా తగ్గించారు. ఇప్పుడు తాజాగా అదే బాటలోనే దేశీయ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా ఈ నెలలో 1000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.ఆశించిన పనితీరును కనబరచకపోవడం వల్లే ఈనిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ఒ ప్రకటనలో తెలిపింది.
ప్రధాన మార్కెట్లలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలంటూ పెరుగుతున్న రక్షణాత్మక ధోరణులు మొదలైనవి భారత ఐటీ సంస్థలపై ఒత్తిడి పెంచుతున్నాయి. తాజా పరిస్థితులు సుమారు 10–15 సంవత్సరాల అనుభవం ఉన్న మధ్య స్థాయి సిబ్బందిపై ఎక్కువగా ప్రతికూల ప్రభావం చూపవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కొత్తగా వస్తున్న టెక్నాలజీ నైపుణ్యాలను నేర్చుకొనేందుకు ఆసక్తి చూపకపోవడమే ఇందుకు కారనమని చెప్తుతున్నారు.
Related