దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలోనూ మరిన్ని వెలుగులు నింపాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుసంపన్నంగా జీవించాలని ఆకాంక్షించారు. కరోనా కారణంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని తిరిగి తీసుకురావడంలో భారత వైమాని దళం, నావికా దళం చేసిన కృషి ప్రశంసనీయమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ఈ దీపావళిని సరిహద్దులలో సైనికులతో కలిసి జరుపుకున్నారు. శత్రువులతో పోరాడే సామర్థ్యాన్నే కలిగి ఉండటం కాకుండా, విపత్తుల సమయంలో ప్రజలకు సహాయం చేయడంలోనూ సాయుధ దళాలు ముందున్నాయని ఆయన ప్రశంసించారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా వ్యూహాత్మకంగా వ్యవహరించే దేశాలతోనూ కలిసి పనిచేస్తున్నాం.
ప్రపంచంలో ఉగ్రవాద స్థావరాలు ఏ మూలన ఉన్నా… లేపేసే సత్తా భారత ఆర్మీకి ఉందని మోదీ ప్రశంసించారు. ప్రభారత్ కి వ్యతిరేకంగా కార్యాకలాపాలు చేస్తే వారి ఆ భూభాగంలోకి వెళ్లి బుద్ది చెబుతాం అని ఆయన అన్నారు.
టిక్ టాక్ అభిమానులకు శుభవార్త!
భారత్ నుంచి చైనాకు ఎగుమతులు కట్..!