- Advertisement -
కరోనా సోకిన వారు ఆసుపత్రికి వెళ్లి వైద్య సేవలు పొందేందుకు ఢిల్లీ ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ‘జీవన్ సేవ’ అనే యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్. వైరస్ సోకి హోం క్వారంటైన్లో ఉన్నవారికోసం ఈ యాప్ ద్వారా ప్రత్యేక సేవలు అందించనున్నట్లు తెలిపారు.
ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని.. అంబులెన్స్, హెల్త్ చెకప్స్ వంటి సేవలు ఉచితంగా పొందొచ్చని తెలిపారు సత్యేంద్ర జైన్. రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లి క్షేమంగా వారిని ఇంటికి చేర్చాక…వాహనాన్ని తప్పకుండా శానిటైజ్ చేస్తారని వివరించారు.
కొవిడ్ సోకి హోం క్వారంటైన్లో ఉన్న వారికి వైద్య సేవలు అందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ‘జీవన్ సేవ’ అనే యాప్ను అభివృద్ధి చేసింది. ఈ యాప్ను గురువారం అందుబాటులోకి తీసుకొచ్చింది.
కొత్తగా రూ. 2 లక్షల కోట్ల ప్రోత్సాహకాలు..!