Monday, April 29, 2024
- Advertisement -

బయటి దేశంలో కూడా మోడీ మేనియా.. “మోడీ మోడీ.. ” అంటూ నినాదాలు !

- Advertisement -

మనదేశంలో నరేంద్ర మోడీకి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. 2014 ఎన్నికల సీజన్ మొదలుకొని నేటి వరకు ఆయనకు ఉన్న పాపులారిటీ ఏమాత్రం చెక్కు చెదరలేదనే చెప్పాలి. దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మోడీ.. పిల్లల నుంచి పెద్దల వరకు నిత్యం ప్రజల నోళ్లలో నానుతూనే ఉంటారు. అయితే మనదేశ ప్రధాని గనుక ఆయనకు మనదేశంలో ఆమాత్రం పాపులారిటీ ఉండడంలో ఆశ్చర్యమేమి లేదు. కానీ ఇతర దేశాలలో సైతం మోడీ పాపులారిటీ సొంతం చేసుకున్నారంటే ఆయన ప్రభావం ప్రపంచ దేశాలపై ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

చాలా సందర్భాలలో అగ్రదేశాల అధినేతలు సైతం మోడీ పై ప్రశంశలు కురిపించిన సందర్భాలు ఉన్నాయి. దాంతో ప్రపంచ ప్రజానీకంలో కూడా మోడీ తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక తాజాగా జీ-20 సదస్సు కోసం ఇండోనేషియా లో పర్యటిస్తున్న మోడీకి.. బాలిలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సమావేశంలో సభ అంతా కూడా ” మోడీ..మోడీ.. ” అనే నినాదాలతో హోరెత్తింది. ఒక బయటి దేశంలో మోడీ నినాదాలుతో సభ ప్రాంగణం నిండిపోవడంతో మోడీ కూడా కాస్త ఆశ్చర్యానికి లోనైనట్లు తెలుస్తోంది. ఇక జీ-20 సదస్సులో దాదాపు 10 మంది ఇతర దేశాల అధినేతలతో మోడీ భేటీ అయ్యారు. ఇక ఈ సదస్సులో సుదీర్ఘంగా ప్రసంగించిన మోడీ.. ఎన్నో అంశాలను ప్రస్తావించారు. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర వల్ల ఆదేశం చాలా నష్టపోయిందని, ఉక్రెయిన్ లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పడానికి ప్రపంచ దేశాలు సమిష్టిగా కృషి చేయాలని మోడీ సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -