- Advertisement -

టీమిండియా..చెత్తరికార్డు!

- Advertisement -

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని మూడో టీ20లో భారత జట్టు అత్యంత పేలవమైన ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్‌లో చేసిన పేలవ ప్రదర్శనతో టీమిండియా చెత్త రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ అద్భుత ప్రదర్శనతో తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్, సామ్ కరన్‌ల మంచి ఇన్నింగ్స్‌ల సహాయంతో ఆతిథ్య జట్టు నిర్ణీత ఓవర్లలో 201 పరుగుల భారీ స్కోరును సాధించగలిగింది.

భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన భారత జట్టుకు ప్రారంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో టీమిండియా దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఒకేసారి ఇన్ని వికెట్లు కోల్పోవడం, ఒక టీ20 మ్యాచ్‌ పవర్‌ప్లేలోనే భారత జట్టు ఐదు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి.

రెండో టీ20 తరహాలోనే, ఇంగ్లాండ్ మూడో టీ20లోనూ టీమిండియాపై పూర్తి ఆధిపత్యం చెలాయించి ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన ఇంగ్లాండ్.. తదుపరి మ్యాచ్‌లోనూ ఇదే విధమైన ప్రదర్శన చేసి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 125 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తమ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడాడు. జట్టులో ఆటగాళ్ల మధ్య సరైన కమ్యూనికేషన్ (సమన్వయం) మరియు వ్యూహాలను సరిగ్గా అమలు చేయడం వల్లే భారత్‌పై గెలవగలిగామని ఆయన పేర్కొన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -