- Advertisement -
శ్రీకాకుళం జిల్లాలో జీడిపరిశ్రమలు బంద్ పాటిస్తున్నాయి. ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాలని కోరుతూ పరిశ్రమల యజమానులు ఈ బంద్ చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 250కి పైబడి జీడి పరిశ్రమలు ఉన్నాయి. దీన్నే నమ్ముకుని కనీసం పాతిక వేల మంది కార్మికులు జీవనం సాగిస్తున్నారు.
పరిశ్రమ యజమానుల బంద్ నిర్ణయంతో.. కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.
