Friday, May 17, 2024
- Advertisement -

‘మహానటి’లో ఘోర‌మైన తప్పులు చేసారు!

- Advertisement -

అల‌నాటి న‌టి సావిత్రి జీవిత క‌థ‌ను సినిమాగా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.సావిత్రి పాత్ర‌ను హీరోయిన్ కీర్తి సురేష్ పోషించింది.గ‌త వారం రీలిజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.మ‌హ‌న‌టి క‌లెక్ష‌న్లు కూడా అధేవిధంగా ఉన్నాయి.అయితే చిత్ర ద‌ర్శ‌కుడు ఈ సినిమాలో కొన్ని పొర‌పాట్లు చేశాడని అంటున్నారు విశ్లేషకులు.సావిత్రి జీవితం నాశ‌నం కావ‌డానికి ,ఆమె జీవితం చివ‌రి ద‌శ‌లో శారీరకంగా కృంగిపోవటానికి కార‌ణం అయిన ఆమె భ‌ర్త జెమిని గ‌ణేష‌న్ గురించి వివ‌రంగా చూపించ‌లేద‌నే వార్త ప్ర‌ముఖంగా విన‌ప‌డుతుంది.

షూటింగ్ స్పాట్ లో ఉన్నవారందరికి ఇంటి నుంచి సావిత్రి భోజనం తెప్పించి పెట్టేది.అలాంటి సావిత్రికి చివరి రోజుల్లో భోజనం కరువైందని గుమ్మడి ఆత్మకథలో రాసారు. సావిత్రిని బంధువులు మోసం చేయటం,చివరి రోజుల్లో ఆర్ధిక ఇబ్బందులు మాత్రమే చూపారు. కూతురు కూడా పట్టించుకోకపోవటం వంటివి చూపలేదు.ఎందుకంటే సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి కండిషన్స్ పెట్టటమే దీనికి కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -