మహేష్ బాబు తాజా చిత్రం భరత్ అను నేను సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతుంది.బాహుబలి తరువాత వేగంగా 100 కోట్ల మార్కెట్ అందుకున్న చిత్రంగా నిలిచింది.మహేష్ ను యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రిగా చూపించడం ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది. సినిమాకు ఓవరాల్ గా మంచి టాక్ రావడంతో ఇప్పుడు భరత్ అనే నేను టీం మొత్తం ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది.రెండు ఫ్లాప్ల తరువాత హిట్ రావడంతో మహేష్ ఈ సినిమాకు పని చేసిన టీంకు పార్టీ ఇచ్చాడు. ఈవెంట్ కు సినిమా కోసం పనిచేసిన కోర్ టీం అంతా అటెండయ్యింది.
ఈ పార్టీలో మహేష్ బాబుతో పాటు సినిమా దర్శకుడు కొరటాల శివ కూడా హజరైయ్యారు.పార్టీకి హీరోయిన్ కైరా అద్వానీ రాలేదని తెలుస్తుంది. ఈ పార్టీకి డైరక్టర్ వంశీపైడిపల్లితో పాటు మైత్రీ మూవీ మేకర్స్ వారు కూడా వచ్చారు. కొరటాల శివ – మహేష్ ల కాంబినేషన్ లో ఇంతకుముందు శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.