త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి రేసులో వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకున్న వసూళ్లలో మాత్రం జోరు చూపించింది. ఇక సినిమాలో మడతపెట్టి సాంగ్ ఎవర్ గ్రీన్గా నిలిచింది.
సినిమా విడుదలై 80 రోజులు గడుస్తున్న కుర్చీ మడత పెట్టి సునామీ ఆగడం లేదు. తాజాగా 200 మిలియన్ వ్యూస్ను దాటేసింది. ఫిబ్రవరి 1వ తేదీన ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్లో కుర్చీ మడతపెట్టి ఫుల్ వీడియో సాంగ్ అప్లోడ్ చేసింది. 80 రోజుల్లో ఈ ఘనత సాధించింది. అయితే మహేష్ కంటే ముందు బన్నీ పుష్ప సినిమాలోని ఊ అంటావా సాంగ్ ఈ ఫీట్ని 68 రోజుల్లోనే సాధించింది.
కుర్చీ మడతపెట్టి పాటకు డ్యాన్స్ చేస్తూ వేలాది మంది సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు. వార్నర్ లాంటి క్రికెట్ సైతం ఈ పాటకు స్టెప్పులేయడం విశేషం.
తమన్ సంగీతం అందించగా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు.