Friday, May 17, 2024
- Advertisement -

టాలీవుడ్‌కు మ‌రో షాక్ ..క‌న్నుమూసిన ప్ర‌ముఖ నిర్మాత‌

- Advertisement -

టాలీవుడ్‌కు వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. నిన్న ద‌ర్శ‌కుడు విజ‌య బాపినీడు మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఆ వార్త‌ను మ‌ర‌వ‌క ముందే టాలీవుడ్‌కు మ‌రో షాక్ త‌గిలింది.తెలుగు ప్రముఖ నిర్మాత నారా జయశ్రీదేవి ఈ రోజు ఉదయం మ‌ర‌ణించారు. తీవ్ర గుండెపోటుతో ఆమె మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. ఈ రోజు గుండె పోటు రావ‌డంతో ఆస్పత్రి త‌ర‌లించే లోపే ఆమె మ‌ర‌ణించంద‌ని జయశ్రీదేవి కుటుంబ స‌భ్యులు తెలిపారు. శ్రీ మంజునాథ‌, చంద్ర‌వాసం, వందేమాతరం, జ‌గ‌ద్గురు ఆదిశంక‌ర వంటి చిత్రాల‌ని నిర్మించారు నారా జయశ్రీదేవి.

గ‌త కొంత‌కాలం నుంచి ఆమె సినిమాల‌కు దూరంగా ఉంటోంది. గ‌త కొద్దికాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె ఈ రోజు ఉద‌యం మ‌ర‌ణించారు.ఆమె మరణవార్త తెలిసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.సాయంత్రం జయశ్రీదేవి మృతదేహాన్ని బెంగులూరుకి తరలించనున్నారు. నారా జయశ్రీదేవి అంత్య‌క్రియ‌లు రేపు బెంగులూరులో జ‌రగ‌నున్నాయి.

https://www.youtube.com/watch?v=KKeBZ4faDgc

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -