కేజీఎఫ్ సినిమాతో సెన్సేషన్ సృష్టించాడు రాక్ స్టార్ యష్. ప్రస్తుతం టాక్సిక్ ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ ఆప్స్లో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ ఆగస్టు 8 నుండి ప్రారంభం కానుండగా నిర్మాత వెంకట్ కె.నారాయణ, కుటుంబ సభ్యులతో తో కలిసి కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు శ్రీసదాశివ రుద్ర సూర్య ఆలయం, ధర్మస్థలలోని శ్రీ మంజునాథేశ్వర ఆలయం, సుబ్రమణ్యలోని కుక్కే సుబ్రమణ్య ఆలయంను సందర్శించారు.
ఏదైనా కొత్త సినిమా ప్రారంభించే ముందు దేవాలయాలను సందర్శించటం యష్కు అలవాటు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్ర షూటింగ్ బెంగళూరులో ప్రారంభం కానుంది. 8-8-8 అనే నెంబర్ వచ్చే రోజున యష్ తన కొత్త సినిమాను ప్రారంభించటం విశేషం.
గ్యాంగస్టర్ డ్రామా నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుండగా కేజీఎఫ్ 2 వచ్చి దాదాపుగా రెండేళ్లు దాటిపోయింది. ఆ తర్వాత వస్తున్న టాక్సిక్పై భారీ అంచనాలు నెలకొన్నాయి.