Thursday, May 16, 2024
- Advertisement -

ఆ సినిమా తర్వాత స్థానం సర్దార్‍దే!

- Advertisement -

పవన్ సర్దార్ గబ్బర్ సింగ్, మహేష్ బ్రహ్మోత్సవం, అల్లు అర్జున్ సరైనోడు తమ సినిమాలు వేసవిలో రాబోతున్నాయి. ఈ మూడు సినిమాలపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పలంటే తెలుగులో బాహుబలి తరువాత స్థానంలో ఏ సినిమా ఆ రెంజ్ లో నిలబడుతుంది అనే అంశం పై సిని పరిశ్రమలో చర్చలు జరుగుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం పవన్ తన సినిమాతో ఆ స్థానం బర్తీ చేయబోతున్నాడని సినీ పరిశ్రమలో పుకార్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్  సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా బిజినెస్ బాహుబలి రెంజ్‍లో జరుగుతుందని సమాచారం.  ‘అత్తారింటికి దారేది’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.

‘అత్తారింటికి దారేది’ చిత్రంతో 80కోట్ల క్లబ్ లో చేరిపోయాడు పవన్ కళ్యాణ్. ఈ సారి కచ్చితంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తో 100కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. ఈ రకంగా బాహుబలి తర్వాత స్థానం సర్దార్ గబ్బర్ సింగ్ దే అని పవన్ అభిమానులు అనుకుంటు సంతోషపడుతున్నారు.

ఐతే ట్రేడ్ వర్గాలు ప్రకారం బాహుబలి బిజినెస్ చేయడం ఈ తెలుగు సినిమాకి కష్టం… సర్దార్ కి కొంచెం కష్టం ఈ సినిమా మీద పాజీటీవ్ టాక్ వచ్చిన శ్రీమంతుడు ని క్రాస్ చేసి రెండో స్థానంలో నిలుస్తుందని ట్రేడ్ పండితుల వాదానా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -