ఏపీలో కూటమి అభ్యర్థులకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్గా తన తమ్ముడు పవన్ కోసం ప్రత్యేకంగా వీడియో రిలీజ్ చేశారు. దీంతో పవన్ తరపున పిఠాపురంలో ప్రచారం నిర్వహించడం ఖాయమని కొద్దిరోజులుగా మీడియా కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలో మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు చిరు.
రాజకీయాల నుండి ప్రస్తుతం తాను దూరంగా ఉన్నానని…ఎవరి తరపున ప్రచారం నిర్వహించడం లేదని తెలిపారు. ప్రచారానికి రావాలని పవన్ తనను పిలవలేదని.. బయట జరిగేవన్ని పుకార్లేనని చెప్పారు. ఇక కాంగ్రెస్లోనే ఉన్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా లేదని చేయి ఊపారు చిరు. దీంతో కాంగ్రెస్తో బంధాన్ని చిరు తెంచేసుకున్నట్లేనని తెలుస్తోంది.
గురువారం ఢిల్లీలో పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన విందులో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు మెగాస్టార్. అనంతరం ఢిల్లీ నుంచి ఆయన హైదరాబాద్కు వస్తు ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బయలుదేరారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాలపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.