మొన్న జగనన్నను హతమార్చాలని చూశారు…నేడు బడుగు బలహీన వర్గాల నేత రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య , స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పై హత్యాయత్నం జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీసీ నాయకుడు మరియు స్థానిక ఎమ్మెల్యే పై బొజ్జల సుధీర్ రెడ్డి రాళ్ల దాడి చేయించారు.
అయితే అదృష్టవశాత్తు ఆ రాయి తలకి తగలకుండా వీపుకి తగలడంతో ప్రాణాపాయం తప్పింది.ఇలాంటి పిరికిపంద రాజకీయాలు చేస్తే ఎవరూ భయపడరని ప్రజలు మాపై చూపిస్తున్న ఆదరణ తట్టుకోలేక ఎలాగైనా మమ్మల్ని హతమార్చాలని ఇలాంటి రాళ్ల దాడులు చంద్రబాబు నాయుడు ఆదేశాలతో బొజ్జల సుధీర్ రెడ్డి చేయిస్తున్నాడని అన్నారు.
గతంలో ఇదే ఏర్పేడులో ఇసుక మాఫియాతో ఇబ్బంది పడుతున్న రైతులను 17 మందిని లారీల ద్వారా చంపించిన చరిత్ర తెలుగుదేశం దేనిని నేడు మమ్మల్ని కూడా హతమార్చి రాజకీయ ప్రకృతి లేకుండా చేసుకోవాలని బొజ్జల సుధీర్ రెడ్డి ఆరాటపడుతున్నాడు అన్నారు.