‘వొలాన్స్’ అనే అరుదైన జాతికి చెందిన బల్లి.. ఉత్తరాఖండ్ కుమ్తా మండలం హోలవల్లీ గ్రామానికి చెందిన రైతు లోకేశ్ పూజారీ పొలంలో దర్శనమిచ్చింది. ఈ జాతి బల్లులు కేవలం పశ్చిమ కనుమలు, దక్షిణాసియాలోనే కనిపిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ బల్లికి ముందు కాళ్ల నుంచి వెనుక కాళ్ల వరకు రెక్కలు విస్తరించి ఉంటాయి. చిన్న పాదాలతో పాటు పెద్ద తోక ఉంది. ఈ బల్లి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు పక్షివలె ఎగురుతుంది. అంతేకాక ప్రతి నిమిషానికి రంగులు మారుతుంది. అది ఏ ఆకు పై కూర్చుంటే.. ఆ ఆకు వర్ణం వలె మారిపోతుంది. ఈ బల్లి 100మీటర్ల వరకు ఎగరగలదని అటవీ అధికారులు తెలిపారు. ఈ బల్లిని లోకేష్ పూజారీ .. సంతగల్ అటవీ అధికారులకు అప్పగించాడు.

సిరాజ్ భావోద్వేగం.. నాన్నకే అంకితం
అడిగితే బాలయ్యకు ఆ పదవి ఇవ్వొచ్చు.. మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు
ఆ రాముడు మనకెందుకు? ఒక్క పైసా ఇవ్వొద్దు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు