బాహుబలి తర్వాత సౌత్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాల జోరు పెరిగింది. బడా హీరోలందరిని ఒకే ఫ్రేమ్లో చూపించడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు. బడ్జెట్కు భయపడకుండా మల్టీస్టారర్ సినిమాలను తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్తో పాటు మరిన్ని బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కథలు తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తాజాగా మరో బిగ్ మల్టీస్టారర్ రాబోతుందనే వార్త ఫిలిం వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. అది కూడా సౌత్ స్టార్ డైరక్టర్ శంకర్ తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.
మెగా పవర్స్టార్ రామ్ చరణ్, ‘కె.జి.యఫ్.’తో దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యష్లతో ఓ సినిమాను తెరకెక్కించడానికి శంకర్ సన్నాహాలు చేస్తున్నారట. హిస్టారికల్ వార్ డ్రామాగా తెరకెక్కబోయే ఈ ప్రాజెక్ట్ లో రామ్ చరణ్ మెయిన్ లీడ్ లో కనిపిస్తాడట. అయితే నిన్నటి వరుకు సినిమాలో పవర్ స్టార్ వపన్ కల్యాణ్ కూడా స్క్రీమ్ షేర్ చేసుకునే అవకాశం ఉందని కూడా కథనాలు వచ్చాయి.
కానీ ఇప్పుడు పవన్ కాకుండా కన్నడ హీరో యష్ నటించే అవకాశం ఉన్నట్లు మరొక కొత్త రూమర్ వైరల్ అవుతోంది. యష్ సెకండ్ హాఫ్ లో కీలకమైన పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ‘ఇండియన్ 2’పూర్తవ్వగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట. ఒకవేళ ఈ రూమర్ నిజమైతే అభిమానులకు పండగే అనే చెప్పాలి.
హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!
లేడీ గెటప్ లో కనిపించిన టాలీవుడ్ హీరోలు..!