Friday, May 17, 2024
- Advertisement -

2022 నాటికి దేశంలోని ప్రతి పౌరుడికీ సొంత ఇల్లు… వ్యవసాయం, గ్రామీణ రంగాలకు పెద్దపీట

- Advertisement -

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2018-19 ఏడాదికిగాను కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఏప్రిల్‌ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి ఆయన గురువారం ఉదయం లోక్‌సభలో 11గంటలకు బడ్జెట్‌ను ప్రసంగ పాఠాన్ని మొదలుపెట్టారు. జైట్లీ బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం ఇది ఐదోసారి. ఎన్డీయే సర్కార్‌కు ఇది పూర్తిస్థాయి ఆఖరి బడ్జెట్‌. 2019లో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌ కేంద్రానికి అతిముఖ్యమైనది కాగా ఇదే ఏడాది ఎనిమిది రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది. బ‌డ్జెట్‌లోని ముఖ్యాంశాలు….

కొద్దిసేపటి క్రితం పార్లమెంట్ లో అరుణ్ జైట్లీ 2018-19 బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
సాహసోపేత నిర్ణయాలు తీసుకుని పేదరికాన్ని నిర్మూలిస్తామని హామీ ఇచ్చాం
నిజాయితీ, పారదర్శక విధానాలతో ఎంతో మార్పు వచ్చింది
మోదీ సంస్కరణలతో వృద్ధి రేటు పెరిగింది
మరిన్ని విదేశీ పెట్టుబడులు దేశంలోకి వస్తున్నాయి.
తొలి మూడేళ్లలో సగటున 7.5 శాతం వృద్ధి.
ఈ సంవత్సరం స్థూల ఆర్థిక వృద్ధి పెరుగుతుంది.
ప్రస్తుతం భారత్ 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ.
ప్రపంచంలోనే 7వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగాం.
అతి త్వరలో ఐదో ఆర్థిక శక్తి ఇండియానే.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 15 శాతం పెరుగుతాయి.
వ్యవసాయం, గ్రామీణ రంగాలకు పెద్దపీట.
విద్యకు, సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం
సౌభాగ్య పథకంతో లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపాం.
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే సర్కారు లక్ష్యం
పలు పథకాలను నేరుగా లబ్దిదారులకే అందిస్తున్నాము.
రైతుల ఉత్పాదకతను పెంచే చర్యలు చేపడుతున్నాం.
వారికి దిగుబడిని, గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి.
ధాన్యం పప్పు దినుసుల మద్దతు ధరను ఒకటిన్నర రెట్లు పెంచాం.
నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.
ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి.
నల్లధనాన్ని అరికట్టడంలో తొలి అడుగులు పడ్డాయి. మరిన్ని నిర్ణయాలు తీసుకుంటాం.
పెట్టుబడులను పెంచుతూ, వృద్ధికి సహకరించేలా సంస్కరణలు తీసుకొస్తాం.
తయారీ రంగంలో వృద్ధి రేటు తిరిగి పట్టాలెక్కింది.
మాన్యుఫాక్చరింగ్ రంగంలో వృద్ధి రేటు ఇప్పుడు 8 శాతం.
రెండు రోజుల్లో పాస్ పోర్టు మంజూరు చేయడం ఓ గొప్ప విజయం.
ఒక్క రోజులోనే కంపెనీ రిజిస్ట్రేషన్ ను చేసి చూపించాం.
ప్రత్యక్ష పన్నుల రాబడి ప్రయోజనం పేదలకు దక్కుతోంది.
నగదు బదిలీలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేశాం.
దేశంలో అవినీతి తగ్గిపోయింది.
గత కొన్నేళ్లుగా అమలు చేస్తున్న సంస్కరణల ఫలితాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయి.
డిజిటలైజేషన్ తో ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత ఏర్పడింది.
బ్యాంకుల పునర్ వ్యవస్థీకరణ కొత్త సంస్కరణలకు నాంది పలికింది.
వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, పోషకాహారంపై ప్రధానంగా దృష్టి పెట్టాం.
అన్ని మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఒకే యంత్రాంగం ఏర్పాటు.
గ్రామీణ వ్యవసాయ మార్కెట్లకు రూ. 2 వేల కోట్లు.
రైతుల కోసం జిల్లాల్లో క్లస్టర్ల ఏర్పాటు.
వ్యవసాయ ఉత్పత్తుల కోసం పటిష్ఠమైన క్లస్టర్ విధానం.
ఆహార శుద్ధి, వాణిజ్య శాఖలతో కలసి వ్యవసాయ ఉత్పత్తుల క్లస్టర్లు.
సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు మరింత ప్రాధాన్యం.
సేంద్రీయ వ్యవసాయం చేసేలా మహిళా సంఘాలకు ప్రోత్సాహం.
పర్ ఫ్యూమ్ ఆయిల్స్ కోసం రూ. 200 కోట్లు.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు రూ. 1,400 కోట్లు.
ఆపరేషన్ గ్రీన్ కోసం రూ. 500 కోట్లు.
42 మెగా ఫుడ్ పార్కులను పటిష్ఠం చేసేందుకు కృషి.
ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనతో మరిన్ని రహదారుల అనుసంధానం
మరో నాలుగేళ్లలో అన్ని గ్రామాలకూ పక్కా రహదారులు.
2017-18లో ఎగుమతులు 17 శాతం.
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో సరళీకరణ.
రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డుల మంజూరు.
పాడి, ఆక్వా రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు.
పశు సంవర్థక, ఆక్వా అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు.
దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు.
పేదలకు ప్రయోజనకరంగా ఉండేలా స్వచ్ఛ భారత్ అభియాన్.
మహిళల హుందాతనాన్ని కాపాడుతున్న శౌచాలయాల నిర్మాణం.
2022 నాటికి దేశంలోని ప్రతి పౌరుడికీ సొంత ఇల్లు.
2019 నాటికి మహిళా సంఘాలకు రూ. 75 వేల కోట్ల రుణాలు
వెదురు పరిశ్రమ ప్రోత్సాహం కోసం రూ. 1,200 కోట్లు.
నీటి వసతి లేని 96 జిల్లాల కోసం ప్రత్యేక నిధి.
ఇప్పటికే 8 కోట్ల మంది మహిళలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు.
జాతీయ జీవనోపాధి మిషన్ కోసం రూ. 5,750 కోట్లు.
విద్యా వ్యవస్థలో ప్రమాణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
నాణ్యమైన విద్యా బోధన కోసం మరింత కృషి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -