Thursday, May 8, 2025
- Advertisement -

బదాయూ నిందితుడిని అర్ధరాత్రి పట్టేసిన యూపీ పోలీసులు..!

- Advertisement -

ఉత్తర్​ప్రదేశ్​ బదాయూ సామూహిక అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. గురువారం అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేసినట్లు జిల్లా మెజిస్ట్రేట్​ ప్రశాంత్​ కుమార్​ వెల్లడించారు.

50 ఏళ్ల మహిళను అత్యాచారం చేసిన ఘటనలో ప్రధాన నిందితుడైన ఆలయ పూజారి సత్య నారాయణ ఇంతకాలం పరారీలో ఉన్నాడు. ఉగైతీ పోలీస్​స్టేషన్​ పరిధిలోని అతని సహచరుని ఇంట్లో తల దాచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. పక్కా సమాచారంతో అతన్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారిస్తున్నారు.

ఈ నెల 3న బదాయూ జిల్లా, ఉగైతీ ప్రాంతంలో 50ఏళ్ల మహిళా అంగన్​వాడీ కార్యకర్తపై అత్యాచారం జరిగింది. దేవుడి దర్శనం కోసం ఓ ఆలయానికి వెళ్లిన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. నిందితులైన ఆలయ పూజారి, అతని ఇద్దరు శిష్యులపై ఉగైతీ పోలీస్​ స్టేషన్​లో ఐపీసీ సెక్షన్​ 376-డీ(సామూహిక అత్యాచారం), 302(మర్డర్​)కింది కేసు నమోదు చేశారు. ఇదివరకే ఇద్దరు శిష్యులను అరెస్టు చేశారు.

కేసీఆర్‌కు హెల్త్‌ చెకప్‌, నెక్ట్స్‌ సీఎం ఆయనేనా?

అఖిలప్రియ అరెస్టు ఏపీలో అయితే… వేరేలా ఉండేది…

విజ‌య‌సాయిరెడ్డి ముందే కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన ధ‌ర్మాన‌!

ఆ హీరోతో నటించేందుకు రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్న సాయి పల్లవి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -