బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఏ1 గా ఉన్న టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విషయంలో ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు వైఖరి విస్మయం కలిగిస్తోంది. రెండు రోజుల క్రితం ఆమె హైదరాబాద్లో అరెస్టయిన సమయంలో గానీ, ఆమె గర్భవతి అని తెలిసినా బెయిల్ దొరక్కపోవడంపై గానీ ఆయన స్పందించలేదు. గతంలో పలు భూకబ్జాలు, అవినీతి కేసుల్లో అరెస్టయిన టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చిన రాజప్ప, చింతమనేని ప్రభాకర్ వంటి నేతలకు సంఘీభావం తెలిపి, అధికార వైసీపీపై, పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ చంద్రబాబు నేడు సైలెంట్ అయిపోయారు.
ఏ2 నుంచి ఏ1గా అఖిలప్రియ
ఇక ప్రవీణ్రావు, అతని సోదరుల కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ప్రమేయం ఉందని తేల్చిన హైదరాబాద్ పోలీసులు తొలుత ఆమెను ఏ2గా చేర్చారు. ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని ఏ1 గా పేర్కొన్నారు. అఖిలప్రియను కూకట్పల్లిలో, ఏవీ సుబ్బారెడ్డిని మాదాపూర్లోని వారి నివాసాలకు వెళ్లి అరెస్టు చేశారు. అఖిల ప్రియ భర్త భార్గవరామ్ను ఏ3గా పేర్కొన్నారు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అయితే, తాజాగా ఈ కేసులో అఖిలప్రియే ఏ1 అంటూ పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఏవీ సుబ్బారెడ్డిని ఏ2గా, భార్గవరామ్ను ఏ3గా కేసులు నమోదు చేశారు. దీనిపై అఖిలప్రియ సోదరి మౌనిక సందేహాలు వ్యక్తం చేశారు. సుబ్బారెడ్డికి ఫేవర్గా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అయినప్పటికీ బాబు నుంచి ఎటువంటి ఖండన ప్రకటనలు రాకపోవడం గమనార్హం.
బాబు మౌనానికి కారణాలివేనా..?
టీడీపీ నేతలపై కేసులు, అరెస్టుల సమయంలో అంతెత్తున లేచే చంద్రబాబు అఖిలప్రియ విషయంలో మౌనంగా ఉండటానికి కిడ్నాప్, అరెస్టుల వేదిక తెలంగాణ కావడం, ప్రవీణ్రావు కుటుంబంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి బంధుత్వం ఉండటం కారణం కావొచ్చని తెలుస్తోంది. లేక రాజకీయంగా బలహీనపడిన భూమా కుటుంబంతో ఒరిగేమీ లేదని ఆయన అలా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని కాబోలు. మరోవైపు సామాజిక కోణంలో ఆలోచించినా తమవారు కాకపోవడంతో బాబు అలా చేస్తున్నారేమో! లేదంటే ఈపాటికి అక్రమ అరెస్టులు, రాజకీయ కక్ష సాధింపులు, అధికార దుర్వినియోగం, పోలీసుల జులుం అంటూ ఆయన చేసే హంగామా అంతా ఇంతా ఉండేదని కాదు!
ఆ హీరోతో నటించేందుకు రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్న సాయి పల్లవి
మహేశ్బాబు అభిమాన సంఘం అధ్యక్షుడిగా నాగ చైతన్య!
ఈ హీరోయిన్ ఆ సింగర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.. కానీ 6 నెలలకే…