Thursday, April 25, 2024
- Advertisement -

157 మందితో ప్రయాణికుల‌తో వెల్తున్న ఇధియోపియా విమానం క్రాస్‌..

- Advertisement -

ఆఫ్రికా దేశం ఇథియోపియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. 157 మంది ప్ర‌యాణీకుల‌తో వెల్తున్న ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం(ET 302) ఒకటి ఆదివారం ఉదయం కుప్పకూలింది. రాజధాని అడిస్ అబాబా నుంచి నైరోబీ (కెన్యా రాజధాని)కి వెళుతుండగా ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. అడిస్ అబాబాకు వాయవ్య దిశగా 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిషోఫ్టు పట్టణం సమీపంలో కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 149 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నట్లు విమానయాన సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రమాదంపై ఇథియోపియా ప్రధాని అభి అహ్మద్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ఈ ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సిఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -